Thursday, April 25, 2024

Cm Jagan: వైఎస్ఆర్ ఆసరా పథకం నిధుల విడుదల…నేడు డ్వాక్రా మహిళల అకౌంట్లలోకి డబ్బులు

ఇవాళ ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకం నిధులను విడుదల చేయనుంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారు.

ఇప్పటివరకు నాలుగు విడతల్లో రూ.19,175.97 కోట్లు చెల్లించిన జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం…. మిగిలిన రూ.6394.83 కోట్లను 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెలాఖరు వరకు ఆసరా ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించనుంది. దీంతో ఏపీలోని డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement