Friday, May 3, 2024

AP | మైనర్ బాలికపై అత్యాచారం.. అవమానంతో ఆత్మహత్య

ఏపీలోని కృష్ణా జిల్లా పామర్రులో మైనర్ బాలిక మృతి కేసును పోలీసులు ఛేదించారు.. పామర్రు మండలంలో బాలిక మిస్సింగ్ కేసు ఉదంతం, విషాదంతో ముగిసింది. నాలుగు రోజులుగా బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు, మొవ్వ మండలం మంత్రిపాలెం కాలువలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు.

మంత్రిపాలెం కాలువ వద్దకు చేరుకున్న గుడివాడ డిఎస్పి శ్రీకాంత్ బాలిక మృతదేహాన్ని పరిశీలించి కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. బాలిక తల్లి వాణి ఫిర్యాదు చేసిన వెంటనే 12 బృందాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు చేపట్టగా అనుమానితుడు లోకేష్ ను అదుపులోకి తీసుకొని విచారించామని తెలిపారు.

లోకేష్, అతని బంధువైన నరేంద్ర బాలికను ఉయ్యూరు లోని ఓ లాజిక్ తీసుకువెళ్లి బలవంతంగా అత్యాచారం చేసినట్లు డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు. అత్యాచార అవమానాన్ని తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుందని ఆయన అన్నారు.

- Advertisement -

నిందితుల ఇరువురుపై లోకేష్, నరేంద్ర లపై 376(B),376(VA),342, ఐపీసీ సెక్షన్, ఫోక్సో, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు డిఎస్పి శ్రీకాంత్ చెప్పారు.బాలిక క్షేమంగా తిరిగి వస్తుందని గంపెడాసతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు, కుమార్తె మరణ వార్తవిని శోకసముద్రంలో మునిగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement