Sunday, May 5, 2024

Rain : ఏపీకి వాతావరణశాఖ అలర్ట్…ఈ జిల్లాల్లో వ‌ర్షాలు

రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు ప‌డుతాయ‌ని ఏపీ విపత్తుల సంస్థ పేర్కొంది.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ప్రకాశం జిల్లా పొదిలి, ఏలూరు, ఏలూరు జిల్లా పోలవరం, పల్నాడు జిల్లా జంగమేశ్వరపురం, పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండబారిన పడకుండా ఉండాల‌ని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement