Friday, May 3, 2024

సీఐడీ పోలీసులు కోర్టు ధిక్కరణ.. హైకోర్టులో రఘురామ పిటిషన్

సీఐడీ పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనపై దాడి చేశారనే అంశంపై విచారణ జరపాలని పిటిషన్‌ వేశారు.  సీఐడీ పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని రఘురామ పిటిషన్​లో వివరించారు. ఇప్పటికే ఈ విషయమై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్న రఘురామ న్యాయవాది… హైకోర్టు నుంచి తదుపరి ఆదేశాలు అవసరం లేదని చెప్పారు. సీఐడీ పోలీసుల దాడి అంశంపై పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలిపింది.

ఇదీ చదవండి: ఏపీలో త్వరలోనే కేబినెట్ విస్తరణ.. తెరపైకి కొత్త మంత్రుల పేర్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement