Tuesday, May 7, 2024

రఘురామ అరెస్టుపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై ఆయన భార్య రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిశారు. ఈ సందర్భంగా రాఘురామపై ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుందని ఆరోపించారు. పార్లమెంట్ సభ్యునిగా ఉన్న ఒక వ్యక్తిని అరెస్టు చేసేముందు స్పీకర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అయితే ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఏపీ సీఐడీ అధికారులు రఘురామను అరెస్టు చేశారన్నారు. సీఐడీ కస్టడీలో ఉన్న ఆయనను చిత్రహింసలకు గురి చేశారని వివరించారు. రాఘురామకు ప్రాణహాని ఉందని, ఈ విషయంలో స్పీకర్ జోక్యం చేసుకోవాలని వారు కోరారు. రఘురామ కుటుంబసభ్యుల ఫిర్యాదుపై ఓం బిర్లా సానుకూలంగా స్పందించారు. దీనిపై ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసి నివేదిక తెప్పిస్తానని, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటానని వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఇదే విషయమై కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ లకు రఘురామ కుటుంబం సభ్యులు కలిసి ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి : శైలజ టీచర్ కు హీరోయిన్స్ సపోర్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement