2024లో జరిగే ఒలింపిక్స్లో కచ్చితంగా స్వర్ణం సాధిస్తానని బ్యాడ్మింటన్ స్టార్ పి.వి సింధు ధీమా వ్యక్తం చేశారు.
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన అనంతరం నిన్న విజయవాడకు వచ్చిన సింధూ.. ఈరోజు ఉదయం ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సింధుకి పూర్ణకుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సింధు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఆలయ ఈఓ భ్రమరాంబ అందించారు.
ఈ సందర్భంగా పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ.. టోర్నమెంట్కు వెళ్లేముందు అమ్మవారి దర్శనానికి వచ్చానని చెప్పారు. అమ్మవారి దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.