Friday, May 3, 2024

Punishment – ప్రేమించాడని చావగొట్టారు

కర్నూల్ జిల్లా . స్థానికంగా ఉన్న ఓ యువతిని ప్రేమించాడని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఓ యువకుడిని చావబాదిన సంఘటన ఆదివారం ఆదోని పరిధిలో వెలుగు చూసింది. దీంతో మన స్థాపన చెందిన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలకు వెళితే ఇలా ఉన్నాయి.ఆదోనిలోని కల్లుబావికి చెందిన సాయికుమార్, హావన్నపేటకు చెందిన మహిమ మధ్య గత నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తుంది. వీరి ప్రేమ వ్యవహారం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. ఇది నచ్చని మహిమ తల్లిదండ్రులుపోలీసులను ఆశ్రయించారు.ముందు ఇరుకుంటుంబాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.

అయితే శనివారం రాత్రి సాయి కుమార్ ఇంట్లోకి చొరబడి తమ కూతుర్ని బలవంతం చేయబోయాడని యువతి తల్లిదండ్రులు పిర్యాదు చేసినట్లు సీఐ వెల్లడించారు. అయితే పోలీసులు నిజానిజాలు తెలుసుకోకుండా తన తమ్ముడు సాయికుమార్ ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచక్షణా రహితంగా దాడి చేసారని అన్న విజయ్ కుమార్ వెల్లడించారు.సీఐ నరసింహరాజు తన తమ్ముడినీ విచక్షణ రహితంగా కొట్టాడని విజయ్ కుమార్ వెల్లడించారు. పోలీసుల దాడిలో గాయపడిన సాయికుమార్ లేవలేని, కూర్చోలేని పరిస్థితికి చేరుకున్నాడు.

దీంతో మనస్తాపంకు గురైన సాయికుమార్ పురుగుల మందు త్రాగి ఆత్మహత్యయత్నం ప్రయత్నించాడు. ఆదోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మెరుగైన చికిత్స కోసం శనివారం అర్ధరాత్రి కర్నూలు కు తరలించారు.ప్రస్తుతం బాధితుడు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement