Sunday, April 28, 2024

Chittoor: ప్రైవేట్ బస్సు బోల్తా… 22మందికి గాయాలు

ప్రైవేట్ బ‌స్సు బోల్తాప‌డి 22 మందికి గాయాలైన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గుడిపాల మండలం గొల్లమడుగు మలుపు వద్ద ప్రైవేట్ బస్సు బోల్తాపడిన‌ ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు గుడిపాల మండలంలోని చిత్తూరు – వేలూరు జాతీయ రహదారిపై గొల్లమడుగు మలుపు వద్ద అదుపు తప్పింది. ఈ క్రమంలో గోడను ఢీ కొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో సికింద్రాబాద్ కు చెందిన లలిత (65) తమిళనాడులోని మాని యంబాడికి చెందిన కుబేరన్ (35) తీవ్రంగా గాయ‌ప‌డ‌గా… మరో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement