Monday, April 29, 2024

యువకుడిని కాపాడిన మైరైన్ పోలీసులు

చీరాల, ప్రభ న్యూస్ : ఓ యువకుడు సముద్రంలో కొట్టుకుపోవ‌డాన్ని గమనించిన మైరైన్ పోలీసులు అత‌డిని కాపాడిన సంఘటన ఆదివారం వాడరేవు సముద్ర తీరం వద్ద చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన షేక్ రాజావలి తన స్నేహితులతో కలిసి వాడరేవు సముద్ర తీరానికి వచ్చారు. సరదాగా సముద్రంలో ఆడుకుతుండ‌గా ప్రమాదవశాత్తు లోపలకు కొట్టుకుపోవ‌డాన్ని గమనించిన మైరైన్ పోలీసులు సదరు యువకుడిని కాపాడారు. దీంతో అందరూ ఊపిరిపీలుచుకున్నారు. యువకుడి ప్రాణాలను కాపాడిన‌ పోలీసులను అందరూ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement