Friday, May 3, 2024

పురవీధులలో స్వామి వారి గ్రామోత్సవం

కందుకూరు : కందుకూరు మండలంలోని పలుకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ దేవి సమేత శిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహా శివరాత్రి పర్వదినం పరస్కరించుకొని గ్రామోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. బాజా భజంత్రీలతో స్వామి వారు అత్యంత వైభవంగా నంది వాహనం మీద పలుకూరు గ్రామ వీధుల్లో తిరుగుతూ గ్రామోత్సవంగా బయలుదేరారు. గ్రామంలో భక్తులు స్వామి వారికి హారతులు ఇస్తూ స్వామి వారిని పురవీధుల్లో దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నిర్వహణాధికారి, పూజారి, భక్తులు పాల్గొని స్వామ వారి గ్రామోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement