Sunday, April 28, 2024

AP | పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య.. నెల్లూరు జిల్లాలో ఘ‌ట‌న‌

ముత్తుకూరు (ప్రభ న్యూస్): నెల్లూరు జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న ముత్తుకూరు మండ‌లం పిడతాపోలూరు గ్రామంలో ఇవ్వాల (మంగ‌ళ‌వారం) జ‌రిగింది. గ్రామానికి చెందిన వినీత్ (17) పాలిటెక్నిక్ చ‌దువుతున్నాడు. స్థానిక ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మృతుడు త‌న ఇంట్లో ఉరేసుకుని చనిపోయినట్లు ఎస్సై తెలిపారు. వినీత్ ను కాపాడుకునే ప్రయత్నంలో కుటుంబ సభ్యులు అపోలో హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్ట‌ర్లు నిర్ధ‌రించిన‌ట్టు చెప్పారు. దీనికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement