Tuesday, May 14, 2024

పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలి.. చంద్రబాబు

పోలీసులు చట్టం ప్రకారం పనిచేయాలని.. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునేది నిందితులను రక్షించేందుకు కాదని గుర్తించుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రభుత్వ ప్రాపకం కోసం ఏపీ పోలీసులు మరీ సాగిలపడడాన్ని ప్రజలెవ్వరూ ఆమోదించరని చంద్రబాబు అన్నారు. ఏపీ పోలీస్‌ అనే బ్రాండ్‌ సర్వనాశనం కావడానికి ప్రజలకు పోలీసులపై నమ్మకం పోవడానికి ప్రస్తుతం ఏపీలో జరుగుతునే కొన్ని ఘటనలు చాలన్నారు. కుప్పంలో నిరసనలు చేపడితే హత్యాయత్నం కేసుపెట్టారని మండిపడ్డారు. విజయవాడలో దాడి చేసి కన్ను పోగొడితే స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపారని ఆరోపించారు. ఈ రెండు ఘటనల్లో వ్యవహరించిన తీరు పోలీసు శాఖ ప్రతిష్టకే మాయని మచ్చగా మిగులుతుందని అన్నారు. ప్రజలకు పోలీసులపై నమ్మకం పోవడానికి ఈ ఘటన చాలని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement