Thursday, May 2, 2024

AP: పట్ర కులస్థులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎంకు వినతి

శ్రీ సత్యసాయి బ్యూరో, నవంబర్ 11(ప్రభ న్యూస్) : రాష్ట్రంలో పట్ర కులస్తులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే తమ కులస్థులకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసినట్లు పట్ర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్ద పోతుల హనుమంతు రాయుడు తెలిపారు.

అలాగే తమ కులస్థులకు అన్ని జిల్లాల్లో కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేయాలని, అహోబిలం శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో అన్నదాన సత్రంకు అహోబిలం పీఠాధిపతులు కేటాయించిన స్థలంపైన మరొక 25సెంట్ల స్థలం కేటాయించాలని, పలు విషయాలపైన చర్చించారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందిస్తూ.. మీ పట్ర కులానికి వెంటనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, రాబోయే రోజుల్లో చట్ట సభల్లో అవకాశం కూడా కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో నూతన రాష్ట్ర కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్ర కులస్థులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement