Friday, May 3, 2024

AP : ప్రజలారా కుట్రలను చేదించండి.. బాబు ట్వీట్‌…

ఏపీలో రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ న‌డుస్తుంది. పెన్షన్లను టీడీపీ అడ్డుకుంటుందని వైసీపీ చేస్తున్న ప్రచారంపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

పెన్షన్ లు పంచవద్దని టీడీపీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు. ఇంటింటికీ పెన్షన్ ఇవ్వకూడదు అని ఎన్నికల సంఘం కూడా ఆదేశించలేదు. పెన్షన్ ల విషయంలో నేడు జరుగుతుంది అంతా పెద్ద రాజకీయ కుట్ర. తన రాజకీయ ప్రయోజనాల కోసం వృద్దులు, వికలాంగులను కూడా ఇబ్బందులు పెట్టే పాలకులు మనకు అవసరం లేదు.

- Advertisement -

‘వైసీపీ నేతలు, జగన్ రెడ్డి బతుకే ఒక ఫేక్ బతుకు. తప్పుడు ప్రచారంతో, అవాస్తవాలతో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం, నీచమైన తీరు వారి డిఎన్ఎలోనే ఉంది. ప్రజలారా కుట్రలను చేదించండి….దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టండి. అధికారం లోకి రాగానే పెన్షన్ రూ.4000 కు పెంచి అనవసర ఆంక్షలు తొలగించి ఇంటి వద్ద పెన్షన్ ఇస్తాం.’ అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement