Friday, May 17, 2024

Pawan Kalyan – త్వ‌ర‌గా కోలుకొని ప్ర‌జాక్షేత్రంలోకి కెసిఆర్ రావాలి – జనసేనాని ఆకాంక్ష

అమరావతి: బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు గాయమైందని తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ”కేసీఆర్‌ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎన్నో సవాళ్లను అధిగమించిన ఆయన ఈ అనారోగ్య పరిస్థితులనూ మనోధైర్యంతో అధిగమిస్తారనే నమ్మకం నాకుంది. పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజలకు, సమాజానికి తన సేవలు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నాను” అని పవన్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement