Sunday, April 28, 2024

Pawan Kalyan: ఇవాళ విశాఖలో ప‌ర్య‌టించ‌నున్న‌ పవన్ కళ్యాణ్..

ఇవాళ‌ విశాఖపట్నంలో జనసేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఎస్.రాజా గ్రౌండ్స్ లో జనసేన బహిరంగ సభ జరుగనుంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో పలువురు వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు చేరనునన్నారు.

ఇప్పటికే ఆళ్వార్‌దాస్‌ మైదానంలో ఏర్పాటు పూర్తి అయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు మైదానానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారన్నారు. మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రైతుల సమస్యలు, వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరాన్ని సభలో ప్రస్తావించనున్నారు. రాబోయే ఎన్నికలకు ఎలా సంసిద్ధం కావాలనే అంశంపై 100 రోజుల ప్రణాళికను ఆయన వివరించనున్నారు. ఇక, ఈ బహిరంగ సభ తర్వాత పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement