Friday, April 19, 2024

అనంతపురం జిల్లాకు పవన్‌ కల్యాణ్‌.. కౌలు రైతుల కుటుంబాలకు బాసటగా..

అమరావతి, ఆంధ్రప్రభ: ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్థిక సాయం అందించి వారిలో ధైర్యం నింపడానికి తలపెట్టిన కౌలు రైతుల భరోసా యాత్రను అనంతపురం జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం 12వ తేదీ ఉదయం 9 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి మండల కేంద్రమైన కొత్తచెరువు గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటు-ంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. అనంతరం పదిన్నర గంటలకు కొత్త చెరువు నుంచి బయలుదేరి ధర్మవరంలో మరో బాధిత రైతు కుటు-ంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించనున్నారు. ధర్మవరం నుంచి 11:20 గంటలకు బయలుదేరి ధర్మవరం రూరల్‌లోని గొట్లూరు గ్రామానికి చేరుకుని, అక్కడ ఆత్మహత్య చేసుకున్న మరో రైతు కుటు-ంబాన్ని పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపి ఆర్థిక సాయం చేస్తారు.

అక్కడి నుంచి 12 గంటల10 నిమిషాలకు బయలుదేరి అనంతపురం రూరల్‌ మండలంలోని పూలకుంట గ్రామానికి వెళ్లి, ఆ గ్రామంలో సుమారుగా 20 రోజుల కిందట ఆత్మహత్యకు పాల్పడిన యువ రైతు కుటు-ంబాన్ని ఓదార్చి వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. చివరిగా 3 గంటలకు అనంతపురం రూరల్‌ మండలంలోని మన్నీల గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు కౌలు రైతుల కుటు-ంబాలకు ఆర్థిక సహాయం అందచేసి అక్కడ నిర్వహించే గ్రామసభ(రచ్చబండ) కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన మరికొందరు కౌలు రైతుల కుటు-ంబాలకు ఈ సభలో పవన్‌ కల్యాణ్‌ ఆర్థిక సహాయం అందజేసి వారి కుటు-ంబ పరిస్థితులు తెలుసుకోనున్నారు. గ్రామ సభ అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లాలని షెడ్యూల్‌ ఖరారైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement