Monday, April 29, 2024

Pawan: రాజకీయలను పలుచనలు చేయోద్దు: వైసీపీకి పవన్ సూచన

ఏపీ అసెంబ్లీలో నిన్న చోటుచేసుకున్న పరిణామాల రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు భార్యపై వైసీపీ నేతలు నేతలు చేసిన వ్యాఖ్యలను పలు పార్టీలు ఖండిస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కంట తడి పెట్టడం బాధాకరమని పవన్ అన్నారు. ప్రతిపక్ష నేత కుటుంబసభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయని విమర్శించారు. ఆడపడుచుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన స్థానాల్లోని వ్యక్తులు మరింత జాగ్రత్త వహించాలని సూచించారు. ఓవైపు వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే.. ప్రజా ప్రతినిధులు ఇవేమీ పట్టనట్టు ఆమోదయోగ్యంకాని విమర్శలు, వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరమన్నారు.

మహిళలను కించపరచడం, వారి గౌరవ ప్రతిష్ఠలకు హాని కలిగించడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పవన్​ అన్నారు. ఈ తరహా దిగజారుడు రాజకీయాలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇదే తరహా కొనసాగితే ఇది ఒక అంటు వ్యాధిలా అంతటా ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగించే ప్రమాదం ఉందన్నారు. ఇటీవల సభలు, సమావేశాలు, చివరికి టీవీ చర్చలలో కొన్నిసార్లు వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంటోందని పవన్ పేర్కొన్నారు. ప్రజల దృష్టిలో రాజకీయ వ్యవస్థను పలుచనలు చేయవద్దని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement