Friday, May 3, 2024

Pawan: మరోసారి కాకినాడకు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపటి నుంచి మూడు రోజులపాటు కాకినాడలో ప‌ర్య‌టించ‌నున్నారు. అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లతో విడిగా విడిగా సమావేశం కానున్నారు.

గత వారంలో మూడు రోజులు కాకినాడ లోనే ఉన్న పవన్ కల్యాణ్‌.. కాస్త విరామం తర్వాత మళ్లీ పర్యటించనున్నారు. కాకినాడ సిటీ పై ప్రత్యేక దృష్టి పెట్టారు సేనాని.. డివిజన్ల వారీగా నేతలు కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. మొత్తం 50 డివిజన్ లలో 22 డివిజన్ ల రివ్యూ ముగిసింది.. మిగతా డివిజన్ లు రివ్యూ ఈ పర్యటనలో చేయనున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement