Thursday, May 2, 2024

AP: చేబ్రోలులో.. ఉగాది వేడుకల్లో పవన్‌కల్యాణ్‌

ఉగాది పండుగ సంద‌ర్భంగా జనసేన అధినేత‌ పవన్‌కల్యాణ్‌ వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నిర్వహించిన ఉత్సవాలకు సోదరుడు నాగబాబు, తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేతలతో కలిసి హాజరయ్యారు. పవన్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందించారు.

అనంతరం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ… ప్రజలంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నామని.. క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామన్నారు. ఈ ఏడాది ప్రజలకు మేలు జరగాలని.. రైతులు, మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు రావాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement