Friday, May 3, 2024

ప్రజలను మభ్యపెడుతున్న పవన్, చంద్రబాబు.. సజ్జల

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రజలను మభ్యపెడుతున్నారని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… పవన్, చంద్రబాబు కలవడం చారిత్రక ఆవశ్యకతగా చెప్పుకొస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చేందుకు కుట్ర బుద్దితో వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాపత్రయ పడుతున్నారన్నారు. ఇప్పటం గ్రామంలో పవన్ ఎందుకు ఆవేశంగా ప్రవర్థించారని ప్రశ్నించారు. జనసేన సభకు స్థలం ఇచ్చిన వారిలో ఒక్కరి ఇల్లూ కూల్చలేదన్నారు. పవన్ కళ్యాణ్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement