Friday, May 10, 2024

Palasa – లారీ చక్రాల కింద రెండు జీవితాలు బలి

పలాస నవంబర్ 22 (ప్రభ న్యూస్)మండలంలోని నీలావతి గేటు సమీపం జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద నీలావతి గ్రామానికి చెందిన బొంగు సుందరరావు (37), మిన్నారావు(40) అక్కడిక్కడే మృతి చెందారు

. స్థానికులు, కాశీబుగ్గ పోలిసులు కథనం మేరకు పలాస మండలం పెద్ద నీలావతి గ్రామానికి చెందిన బొంగు సుందరరావు, మిన్నారావులు కలిసి కాశీబుగ్గ నుంచి గ్రామానికి ద్విచక్ర వాహనం పై వస్తుండగా నీలావతి రైల్వే గేటు సమీపం జాతీయ రహదారి వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో సుందరరావు, మిన్నారావులు లారీ చక్రాలు క్రింద నలిగిపోయి అక్కడిక్కడే మృతి చెందారు.

విషయం తెలుసుకున్న కాశీబుగ్గ డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా జరిగిన విషయాన్ని తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు మృతదేహాలు వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మిన్నారావు సుమారు పదేళ్ళ క్రితం ఒడిషా రాష్ట్రం పర్లాఖిముండి నుంచి వలస వచ్చి మేస్త్రి పనులు చేస్తూ పెద్ద నీలావతి గ్రామానికి చెందిన సొర్రా వనజాక్షిను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి పెద్ద నీలావతి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. మృతుడుకు బార్య సొర్రా వనజాక్షి, ఒక కుమారై ఉన్నారు. బొంగు సుందరరావు గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మృతుడుకు బార్య గీత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement