Sunday, April 28, 2024

Tunnel rescue – ఉత్తరాఖండ్ ఆపరేషన్ లో శ్రీసిటీలోని బి-రోలెక్స్ భాగస్వామ్యం

శ్రీసిటీ (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) : ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను సురక్షితంగా కాపాడిన ఆపరేషన్ లో తిరుపతి జిల్లా శ్రీ సిటీ కి చెందిన ఒక పరిశ్రమ కీలక భాగస్వామ్యం వహించింది.చిక్కుకున్న వారిని రక్షించే దశలో నవంబర్ 25న డ్రిల్లింగ్ యంత్రం విరిగి ముందుకు కదలక సిబ్బంది పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. తగు పరిష్కారం కోసం పర్యవేక్షక అధికారులు డి ఆర్ డి ఓ మాజీ ఛైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డిని కోరగా, ఆయన వివిధ నిపుణుల ఏజెన్సీలను సంప్రదించారు. ఆయన పిలుపునకు శ్రీసిటీ లోని బి-రోలెక్స్ పరిశ్రమ స్పందించింది. ఆ పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ వై.శ్రీనివాస్ రెడ్డి, డ్రిల్లింగ్ కు పరిష్కార మార్గంగా ప్లాస్మా ఆధారిత కట్టింగ్‌ను అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా ప్రతిపాదించారు. అలాగే మూడు గంటల వ్యవధిలోనే రెండు పోర్టబుల్ ప్లాస్మా కట్టింగ్ మెషీన్‌లను బి-రోలెక్స్ సిద్ధం చేసింది.

వీటితో పాటు, ప్లాస్మా కట్టర్లను వినియోగించే పరిశ్రమకు చెందిన ముగ్గురు సభ్యుల నిపుణుల బృందాన్ని (సంతోష్ కుమార్, అజయ్ షా, నాగరాజు) ఘటన స్థలానికి పంపారు. ప్లాస్మా కట్టర్‌లతో పాటు నిపుణుల బృందాన్ని పంపడానికి ప్రభుత్వం ప్రత్యేక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఏర్పాటు చేసింది.

విజయవంతంగా కట్టర్ నిపుణులు పైప్‌లైన్‌ను సిద్ధం చేసి, కొన్ని గంటల వ్యవధిలో సహాయక చర్యలకు అడ్డుపడిన యంత్రపు ముక్కలను తొలగించారు.బి-రోలెక్స్ సమకూర్చిన ప్లాస్మా కట్టింగ్ మెషీన్‌ లు, సహాయక చర్యల్లో ముఖ్యమైన అడ్డంకిని అధిగమించడంలో, 800 మిమీ వ్యాసం కలిగిన పైపును ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. సహాయక చర్యలు పర్యవేక్షించిన భాస్కర్ కుల్బే, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఇతర సీనియర్ అధికారులు వేగంగా స్పందించి సాయమందిం చిన శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారువేగంగా స్పందించి సహాయక చర్యలకు నిపుణుల బృందాన్ని పంపిన బి-రోలెక్స్ పరిశ్రమ శ్రీసిటీ పారిశ్రామిక కుటుంబంలో భాగం కావడం గర్వంగా ఉందని పేర్కొన్న శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement