Monday, April 29, 2024

కొనసాగుతున్నఆపరేషన్ మదర్ టైగర్ టి 108.

కర్నూలు బ్యూరో – ఆత్మకూరు డివిజన్, గుమ్మాడాపురం అటవీ ప్రాంతంలో మదర్ టైగర్ టీ 108 ఆపరేషన్ ముమ్మరంగా సాగుతుంది. కనిపించకుండా పోయిన తల్లి పులి కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో గుమ్మడ పురం నల్లమల్ల అటవీ ప్రాంతంలో సుమారు 70 ట్రాప్ కెమెరాలతో అన్వేషణ కొనసాగుతుంది. అయితే నేటి వరకు తల్లిపులి ఆచూకీ కనిపించలేదు. ఈ క్రమంలో నేడు చివరి ప్రయత్నంగా ప్రత్యేక డ్రోన్ కెమెరా బృందాలను అటవి శాఖ అధికారులు రంగంలో దించనున్నారు. డ్రోన్ కెమెరాలతో గుమ్మడాపురం అడవి శాఖ పరిధిలో ప్రత్యేకంగా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఒకవేళ ఏరియల్ సర్వేలో తల్లిపులిని గుర్తిస్తే పిల్ల పులులను దాని వద్దకు చేర్చే అవకాశం ఉంది. అయితే తల్లి పులి కదలికను అంచనావేసి ఆ తర్వాతనే నిర్ణయం తీసుకోనున్నారు.

ఒకవేళ తల్లి పులి జాడ తెలియకపోతే నేటి అర్ధరాత్రి తిరుపతి జూ కు ఆడ పసి పులి పిల్లలను తరలించే అవకాశం ఉందని అటవీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో కనీసం ప్రపంచ మహిళా దినోత్సవ నాడైన ఆడ పులి కూనలకు న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. ఇందుకు కారణం తల్లి పులి మనుగడపై రోజు రోజుకు పెరుగుతున్న అనుమానాలు, చివరి సారిగా డిసెంబర్ లో ట్రాప్ కెమెరా లో ట్రేసౌట్ చేశారు. ఆ తర్వాత దాని ఆచూకీ నేటి వరకు అటు విశాఖ అధికారులు గుర్తించింది లేదు. ప్రస్తుతం కూడా పులి పిల్లలు లభ్యమైన అటవీ పరిసరాల్లో ఎక్కడా కూడా తల్లి పులి పాద ముద్రలు లభించలేదు. దీన్ని బట్టి తలిపులి ఉందా లేదా అన్నది ప్రస్తుతం బేతాళ ప్రశ్నగా మారింది. అయితే అటవీశాఖ ఆధ్వర్యంలో పట్టువదలని విక్రమార్కుల్లా డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ వైల్డ్ కంజర్వేషన్ దృష్టికి తీసుకెళ్లి మదర్ టైగర్
ఆపరేషన్ ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్ టి సి ఏ కూడా రంగంలో దిగింది. ఈ బృందం ఆత్మకూరులోనే ఉండి.. పర్యవేక్షిస్తున్నట్లు ఎన్ ఎస్ టి ఆర్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించడం విశేషం. అధికారుల అన్వేషణ ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం బిక్కు బిక్కుమంటూ ఆత్మకూరు అటవీ అధికారుల చెంతే నాలుగు ఆడ పసి పులి కూనలు మగ్గుతున్నాయి. అధికారులు వీటి సంరక్షణకు పడుతున్న పాట్లు అంతా, ఇంతా కాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement