Monday, April 29, 2024

AP | శ్రీశైలం పుష్కర ఘాట్‌లో నీట మునిగి ఒక‌రు మృతి

నంద్యాల జిల్లా, శ్రీశైలం : శ్రీశైలం ఆనకట్ట లింగాల గట్టు పుష్కర ఘాట్ వద్ద సోమవారం హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి నీట‌మునిగి మృతి చెందాడు. హైదరాబాద్ జల్లుపల్లికి చెందిన శశికుమార్(43) తన స్నేహితులు భరత్, సాయికుమార్‌లతో కలిసి ఉగాది పండుగను పురస్కరించుకుని శ్రీశైలానికి వచ్చారు. ఇక‌ లింగాల ఘాట్‌ వద్ద పుణ్యస్నానమాచరించేందుకు హైలెవల్‌ ఘాట్‌కు చేరుకున్నారు. స్నానమాచరించేందుకు కృష్ణానదిలోకి దిగిన శశికుమార్‌ నీటిలో మునిగి మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement