Monday, April 29, 2024

AP | 11న రాప్తాడులో సిద్ధం సభ.. జోరుగా ఏర్పాట్లు !

సీఎం జగన్మోహన్‌రెడ్డి సొంత అడ్డాగా చెప్పుకునే రాయలసీమలో ‘సిద్ధం’ సభ నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లా పరిధిలోని రాప్తాడు నియోజకవర్గంలో ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11 మూడో సిద్ధం సభను నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నిలకు కేడర్‌ను సన్నద్ధం చేసేందుకు అధికార వైసీపీ పార్టీ ‘సిద్ధం’ పేరుతో సభలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి సభ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలోని సంగివలసలో నిర్వహించగా, రెండో సభను ఏలూరు పరిధిలోని దెందూలూరు నియోజకవర్గం దగ్గరలో నిర్వహించారు.

ఇక ఇప్పడుడు నిర్వహించనున్న మూడో సభకు రాయలసీమ వేదికగా మారింది. ఇప్పటి వరకు నిర్వహించిన రెండు సభలకు ధీటుగా ఈ సభను నిర్వహించేందుకు అధికార వైసీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. కనీసం ఐదు లక్షల మందితో సభ నిర్వహించనున్నట్టు వైసీపీ నాయకులు చెబుతున్నారు. రాప్తాడు మండల కేంద్రంలోని ఆటో నగర సమీపంలో రాయలసీమ స్థాయలో సభను నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement