Wednesday, April 24, 2024

Breaking: తునిలో కల్తీ ఆయిల్ ముఠా గుట్టురట్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా తునిలో కల్తీ ఆయిల్ తీవ్ర కలకలం సృష్టించింది. జంతు కళేబరాలతో ఆయిల్ తీస్తున్న ముఠా గుట్టు రట్టైంది. రామకృష్ణా కాలనీలో గో సంరక్షణ సభ్యులు, పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఇంట్లో చంపి ఉంచిన గోవులు, జంతు కళేబరాలు, ఆవు చర్మాలతో పాటు కల్తీ ఆయిల్ ను అధికారులు గుర్తించారు. గోవుల్ని చంపి వాటి రక్తం, వ్యర్థాలను ముఠా సభ్యులు డ్రైనేజీలోకి వదిలి పెడుతున్నట్లు గుర్తించారు. అనంతరం సాధారణ నూనెలో ఈ కల్తీ ఆయిల్ ను కలిపి సప్లై చేస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ నూనెను ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement