Monday, April 29, 2024

Nara Lokesh:పోరాడితే పోయేది ఏమీ లేదు…. బానిస సంకేళ్లు త‌ప్ప

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ ట్విట్ చేశారు. సీఎం జగన్‌ పాదయాత్ర సమయంలో ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేశారని విమర్శించారు.


“పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశాడు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, త్వరలో వలంటీర్లు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి. ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టిడిపి పూర్తి స్థాయి మద్దతు ఇస్తోంది. అంగన్వాడీల సమ్మెకు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు మద్దతు తెలిపాయో అలానే సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలని పిలుపు ఇస్తున్నాను ’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement