Sunday, May 5, 2024

Nara Lokesh: మునిగిపోయే వైకాపా నావను ఏ శక్తీ కాపాడలేదు..

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ మునిగిపోయే నావ అని, అభ్యర్థులు పారిపోయినా, సీట్లు మార్చినా మునిగిపోయే వైసీపీ నావను ఏ శక్తీ కాపాడలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ప్రజాగ్రహానికి గురైన వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు పరారీలో ఉన్నారన్నారు.

ఇప్పటివరకు 35 మంది తమ సొంత నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు భయపడి పారిపోయారని ఎద్దేవా చేశారు. వైకాపాలో ఓటమి భయానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమన్నారు. మరో 50 మంది వైకాపా ఎమ్మెల్యేలు కూడా తమ సొంత స్థానాల్లో పోటీ చేసేందుకు విముఖంగా ఉన్నారని చెప్పారు. 2024లో ఇక జగన్ అధికారంలోకి రారని.. ఆంధ్రప్రదేశ్‌ బైబై జగన్ అంటోందని లోకేశ్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement