Tuesday, April 30, 2024

ఎమ్మెల్సీ పర్వత రెడ్డితో వైకాపా నేత కోదండరామిరెడ్డి భేటీ

ముత్తుకూరు ఏప్రిల్ 12 (ప్రభ న్యూస్) : అధికార పార్టీకి చెందిన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని మంగళవారం పోలంరాజు గుంట వైఎస్ఆర్సిపీ నాయకులు దువ్వూరు కోదండరామిరెడ్డి కలిశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మంగళవారం పర్వత రెడ్డి పదవి ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా అమరావతి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైసిపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement