Friday, May 17, 2024

కోర్టులో డాక్యుమెంట్ల చోరీ ఘటనపై విచారణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ విచారణకు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అలాగే కేసు దర్యాప్తు పురోగతిపై హైకోర్టుకు పోలీసులు నివేదిక అందించారు. అయితే సీబీఐ విచారణ అప్పగింతపై వేసవి సెలవుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement