Friday, May 17, 2024

నారాయణ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు.. మోటార్లకు మీటర్లు పెడితే అది నరికేయాల‌ని పిలుపు!

సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో జ‌రిగిన‌ జిల్లా రైతు సదస్సులో పాల్గొన్న ఆయన ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. జగన్ తండ్రి వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే.. జగన్ దాన్ని కాదని మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజన్న పాలన అంటే ఇదేనా? అని ఎద్దేవా చేశారు.

కేంద్రంలోని బీజేపీ మాయ‌లో ప‌డి మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను జగన్ ఇబ్బందులు పాలు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తెలంగాణలో విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తే పగలగొట్టాలని సీఎం కేసీఆర్ సూచించారని, మరి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న మీకు భయమెందుకని నిలదీశారు. అప్పట్లో నిజాం నవాబు వస్తే రాజువచ్చాడని, దూరంగా వెళ్లాలని ప్రజలను ఆయన సైన్యం హెచ్చరించేదని, అంతకుమించి వందలాదిమంది పోలీసులతో జగన్ తిరుమలలో పర్యటించ‌డం దేనికి సంకేత‌మ‌ని విమర్శించారు. జగన్ తిరుమల పర్యటన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా సాగిందని, సీఎంకు ఎందుకంత అభద్రతా భావమని నారాయణ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement