Friday, April 26, 2024

వైసీపీ మైనింగ్ మాఫియా.. అక్రమార్కులతో చిప్పకూడు తినిపిస్తాం

వైసీపీ మైనింగ్ మాఫియా పునాదులు కదులుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ దందా ఒక్కొక్కటిగా బయటపడుతోందని తెలిపారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో.. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వేస్తున్న వైఎస్ జగన్ బంధువర్గం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని పేర్కొన్నారు. గిరిపుత్రుల గుండెలపై గునపం దింపిన జగన్ రెడ్డి పాపాలు పండే రోజు అతి దగ్గర్లో ఉందన్నారు. బాక్సైట్ కోసం తప్పులపై తప్పులు చేసిన జగన్ అండ్ కో తో పాటు మన్యంలో జరిగిన అక్రమ మైనింగ్ కి సహకరించిన అధికారులు కూడా ఈ సారి చిప్పకూడు తినడం ఖాయం అని జోస్యం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మైనింగ్ మాఫియా చేస్తోన్న అరాచకాలు,దోచుకుంటున్న సహజ సంపదకు సంబంధించిన వివరాలు ఆధారాలతో సహా బయటపెట్టి అక్రమార్కులతో ఊచలు లెక్కపెట్టిస్తాం అని నారా లోకేష్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement