Wednesday, April 24, 2024

రోడ్లన్నీ అధ్వాన్నం.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో బస్సు ప్రమాదం

పశ్చిమ‌గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెం వ‌ద్ద జల్లేరువాగులో ఆర్టీసీ బస్సు ప‌డి ప్రయాణికులు మృతి ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర‌ దిగ్ర్భాంతికి గుర‌య్యారు. మృతుల‌కు అశ్రునివాళుల‌ర్పిస్తూ, వారి కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేశారు. గాయ‌ప‌డినవారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాల‌కి ఒక్కొక్క‌రికీ 25 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించాలని లోకేష్ డిమాండ్ చేశారు. అధ్వాన‌రోడ్ల వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. కాంట్రాక్ట‌ర్ల‌కి బిల్లులు చెల్లించ‌క‌, ర‌హ‌దారుల నిధులు మ‌ళ్లించ‌డంతో దారుల‌న్నీ అధ్వానంగా మారి ఇలా ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తున్న‌ది ముమ్మాటికీ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మే అని లోకేష్ ఆరోపించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement