Monday, April 29, 2024

అక్రమ ఇసుక టిప్పర్లను పట్టుకున్న నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్న సందర్భంగా అక్రమంగా తరలివెళ్తున్న ఇసుక టిప్పర్లను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అలియాస్ విషనాగు అవినీతి ఆనవాళ్లు పాదయాత్రలో అడుగడుగునా కన్పిస్తున్నాయన్నారు. మంత్రాలయం నియోజకవర్గం గుడికంబాల రీచ్ నుంచి రాష్ట్రేతర ప్రాంతాలకు తరలివెళ్తున్న ఈ ఇసుక లారీ విషనాగు ఇసుక దోపిడీకి ప్రత్యక్ష సాక్షి అన్నారు.

అడ్డగోలుగా దోచుకొని అడ్డొచ్చిన వారిపై ఎదురుదాడి చేయండని వైసిపి బూతుల స్కూలు ప్రిన్సిపాల్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ట్రైనింగ్ ఇచ్చి పంపాడు కాబోలు. తాను సాక్ష్యాధారాలతో బయటపెడుతున్న అక్రమాలపై సమాధానం చెప్పలేని వైసీపీ సైకోలు తనపై వ్యక్తిగత విమర్శలకు దిగడం దిగజారుడు తనానికి నిదర్శనం కాదా ?! విషనాగులకు విరుగుడు మందు విచ్చలవిడి దోపిడీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమేనన్నారు. ఆ మందే యువగళంలో ప్రజలు నాకిచ్చిన వరమని నారా లోకేష్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement