Sunday, April 28, 2024

AP: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారా భువ‌నేశ్వ‌రీ ప‌ర్య‌ట‌న‌…

ఇవాళ్టి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. కుప్పం, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటన జరుగనుంది. నేటి నుంచి 23 వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆమె పర్యటన కొనసాగుతుంది.

ఇక, చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపంతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాల ఇళ్లకు నారా భువనేశ్వరి వెళ్లనున్నారు. 2 రోజుల్లో 15 మంది కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, ఒక్కో కుటుంబానికి 3 లక్షలు రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. భువనేశ్వరి పర్యటనలో భాగంగా రేపు కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో మహిళలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇక, అలాగే నియోజకవర్గంలో పలు చోట్ల అన్నా క్యాంటీన్లను కూడా నారా భువనేశ్వరి ప్రారంభించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement