Wednesday, May 1, 2024

Mylavaram – ఏసీబీ చిక్కిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) అవినీతి అధికారుల చేతికి మరో అవినీతి అధికారి చిక్కాడు. ఇటీవలే ఇబ్రహీంపట్నంలో అవినీతి అధికారుల దాడుల్లో ఒక అధికారి పట్టు పడగా, తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం లో అటవీశాఖ సెక్షన్ అధికారి అధికారుల వలకి చిక్కాడు. మైలవరం ఫారెస్ట్ ఆఫీసులో సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఏ రామకృష్ణ ఒక రైతు నుండి లంచం తీసుకుంటుండగా అవినీతి శాఖ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. రెడ్డిగూడెం మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన గండిపూడి రాంబాబు అనే రైతు రామకృష్ణ కి రూ 23 వేల లంచం ఇస్తుండగా బుధవారం అవినీతి శాఖ అధికారులు వలపనీ పట్టుకున్నారు.

రైతుకు చెందిన వేప కర్ర నరకడానికి సెక్షన్ అధికారి లంచం డిమాండ్ చేయడంతో అవినీతి శాఖ అధికారులకు రైతు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో రైతు, సెక్షన్ ఆఫీసర్ రామకృష్ణకు లంచం ఇస్తుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. మైలవరం ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో ఉద్యోగి అద్దెకు నివాసం ఉంటున్న ప్రదేశంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు లక్ష తొమ్మిది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం రామకృష్ణ ఇంట్లో అధికారులు పాదాల నిర్వహిస్తుండగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement