Tuesday, April 30, 2024

దాచేపల్లి లో యువకుడి దారుణ హత్య… ముక్కలుగా నరికి తగులబెట్టిన వైనం.

దాచేపల్లి, ఫిబ్రవరి 25(ప్రభన్యూస్). వివాహేతర సంబంధం నేపధ్యంలో వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు గా నరికి మిర్చి పొలం లో తగులబెట్టిన దారుణ ఘటన దాచేపల్లి పట్టణం లో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన గరికపాటి కోటేశ్వరరావు (45) దాచేపల్లి నగర పంచాయతీ లో పంపు ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.పట్టణానికే చెందిన బోంబోతుల సైదులు అనే వ్యక్తి కూడా పంపు ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఈ నేపధ్యంలో మృతుడు కోటేశ్వరరావు నిందితుడు సైదులు భార్య తో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో రాత్రి 9.30 గంటల సమయంలో పట్టణం సమీపంలోని ట్యాంక్ వద్ద వాల్ ఆపేందుకు వెళ్ళిన కోటేశ్వరరావు తో అక్కడే ఉన్న సైదులు గొడవ కు దిగి లావుపాటి కట్టె తో మృతుని తల వెనుక భాగంలో బలం గా కొట్టగా అక్కడిక్కడే చనిపోయాడు.మృతదేహన్ని పట్టణ సమీపంలో గల తన మిర్చి పొలం లోకి ద్విచక్ర వాహనం పై తరలించి మృతదేహాన్ని ముక్కలు గా నరికి పొలంలో ఉన్న లావుపాటి మొద్దులు, మిర్చి కట్టె వేసి మృతదేహాన్ని దగ్ధం చేశారు.

అదేసమయం లో యధాలాపం గా అటుగా వచ్చిన మృతుని సోదరుడు, కుమారుడు నిందితుడు సైదులు ఆ సమయంలో అక్కడ ఉండటం, పొలం లో మంటలు వస్తుండటం చూసి అక్కడికి వెళ్లి చూడగా మృతదేహం అంతా తగులబడి కేవలం పాదం మాత్రం కనపడటంతో అనుమానమొచ్చిన వారు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.హుటాహుటిన అక్కడకు చేరుకున్న సిఐ బిలాలుద్దీన్, సిబ్బంది తగులబడుతున్న చితిని అర్పి నిందితుడు సైదుల్ని ప్రశ్నించగా నిజం ఒప్పుకొవటంతో అదుపు లోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.విషయం తెలుసుకున్న మృతుని బంధువులు, రజక సంఘం నాయకులు భారీ ఎత్తున పోలీసు స్టేషన్ వద్ద కు చేరుకొని నిందితుణ్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.దాచేపల్లి సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement