Tuesday, April 30, 2024

హత్య కేసును చేధించిన పోలీసులు

గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఈ నెల 7వ తేది జరిగిన హత్యకేసును పోలీసులు చేధించారు. ఈ సందర్భంగా మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయంలో గుంటూరు అర్బన్ డీఎస్పీ రాంబాబు శనివారం విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద నివసిస్తున్న మతి స్థిమితం సరిగా లేని వ్యక్తిని సమీపంలో నివసించే వ్యక్తులే హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నింలో భాగంగా తాడికొండ అడ్డరోడ్డు వద్ద పడవేసినట్లు తెలిపారు. కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. సాక్ష్యాదారాలు లేని కేసును రోజుల వ్యవధిలో చేధించిన పోలీస్ సిబ్బందికి రివార్డులు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement