Friday, May 17, 2024

AP | బస్టాండ్ టాయిలెట్‌లో ప‌సిగుడ్డు.. ఆడ‌పిల్ల‌ని వ‌దిలేసిన త‌ల్లి

వినుకొండ క్రైమ్‌, (ప్రభ న్యూస్) : అప్పుడే పుట్టిన పసికందును ఆర్టీసీ బస్టాండ్ లోని టాయిలెట్ లో వదిలేసి వెళ్లిందో మ‌హా త‌ల్లి. పల్నాడు జిల్లా వినుకొండలో ఈ ఘ‌ట‌న శనివారం రాత్రి వెలుగుచూసింది. నవజాత శిశువును చూసిన స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి ఆర్టీసీ డిపోలో హెల్పర్ గా విధులు నిర్వహిస్తున్న జనావత్ రవింద్ర నాయక్ టాయిలెట్ లో బిడ్డ అరుపులు వినిపించటంతో గ‌మ‌నించాడు. నవజాత ఆడ శిశువు బేషన్లో కనిపించటంతో పోలీస్ లకు సమాచారం అందించాడు.

ఆ శిశువును వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణ సిఐ సాంబశివరావు, ఎస్ఐ స్వర్ణలత, ఆసుపత్రికి చేరుకొని పాప ఆరోగ్య పరిస్థితిని డాక్ట‌ర్‌ రజాక్ ను అడిగి తెలుసుకున్నారు. పసిపాప ఆరోగ్యం బాగుందని డాక్టర్ చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న సీసీ ఫుటేజ్ లను పరిశీలించి శిశువును ఆర్టీసీ టాయిలెట్స్ లో వదిలి వెళ్ళిన వారి వివరాల కోసం విచారణ చేపడుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement