Sunday, April 28, 2024

AP : ముత్యాలమ్మ అమ్మవారి సేవ‌లో ఎమ్మెల్సీ క‌విత

ఏపీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు పర్యటించారు. పి గన్నవరంలోని ముంగండ గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పునః ప్రాతిష్ఠాపన వేడు కల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం కవిత మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారి పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 400 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం పూర్వజన్మసుకృతమని అనుకుంటున్నానన్నారు. తెలుగు రాష్ట్రాలు సుభీక్షంగా ఉండి ప్రగతి పథంలో ముందుకు సాగే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి దయతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు బాగుండాలని ప్రార్థించానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement