Friday, April 26, 2024

విశాఖపై మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు కీల‌క వ్యాఖ్య‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు విశాఖ రాజ‌ధానిపై కీల‌క‌ వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తలలు తెగినా విశాఖను రాజధాని చేసుకుంటామన్నారు. వికేంద్రీకరణకు మద్ధతుగా వైసీపీ చేపట్టిన విశాఖ గర్జన టీడీపీ గుండెల్లో గునపం దింపుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్తరాంధ్ర అంటేనే ఉద్యమమన్న ఆయన.. ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టాలనే ఉద్దేశం చంద్రబాబు మానుకోవాలన్నారు. మూడు రాజధానులపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనన్నారు. సీఎం జగన్ నిర్ణయానికి ప్రతి గ్రామంలో ప్రజలు హర్షిస్తున్నారని చెప్పారు. తలలు తెగినా ప్రాణాలు పోయినా విశాఖను అభివృద్ధి చేసుకుని తీరుతామని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement