Saturday, April 20, 2024

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. 2 గేట్లు ఎత్తివేత‌

నంద్యాల : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో 1,26,289 క్యూసెక్కుల నీరు వస్తుండగా 1,22,435 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 884.70 అడుగుల వరకు నీరు నిల్వ ఉందని వెల్లడించారు. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement