Thursday, April 25, 2024

మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం..

చిత్తూరు : ఏపీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు పెను ప్రమాదం తప్పింది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్‌ రోడ్‌పై ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డిలు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎంపీ మిథున్‌ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది గాయపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డిలు ఒకే కారులో బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వారులోని వాహనాన్ని ఎదురుగా వచ్చిన కారు ఢకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి కాన్వారులోని కారు పల్టీలు కొట్టింది. కారులో ఉన్న మిథున్‌ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, భద్రత సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డిలు ప్రమాదం నుండి తటిలో తప్పించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement