Monday, April 29, 2024

శవ రాజకీయాలు చేయడానికే చంద్రబాబు ప్రయత్నం

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన అత్యాచార ఘటన దురదృష్టకరమని అన్నారు. ఇకపై మహిళలపై ఈ తరహా ఘటనలు ఎక్కడ జరిగినా ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పారు. ఈ ఘటనపై సీఎం జగన్ వెంటనే స్పందించారన్న మంత్రి.. నిందితులను అరెస్ట్ చేయడమే కాక, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. బాధితురాలి ఆరోగ్యం మెరుగయ్యేంత వరకు ప్రభుత్వం వైద్యం అందిస్తుందని చెప్పారు. టీడీపీ అధనేత చంద్రబాబు శవ రాజకీయాలు చేసేందుకే ఆసుపత్రికి వచ్చారని మండిపడ్డారు. అక్కచెల్లెమ్మల అకౌంట్లలో వేల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వేసే సమయంలో కావాలనే చంద్రబాబు హడావుడి చేశారని విమర్శించారు. మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మపై కాల్ మనీ సెక్స్ రాకెట్ నేతలే దాడి చేశారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement