Sunday, April 28, 2024

DSC: నేడే డీఎస్సీ నోటిఫికేషన్… విడుదల చేయనున్న మంత్రి బొత్స

ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 6100 టీచర్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది.

పరీక్షల నిర్వహణ పై నిన్న విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.త్వరితగతిన నియామక ప్రక్రియలు పూర్తిచేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ రోజు నోటిఫికేషన్ విడుదల సమయంలో వయోపరిమితిని పెంచాలనే డిమాండ్ పై ఏమైన ప్రకటన వుంటుందని నిరుద్యోగులు కొండత ఆశతో ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement