Thursday, May 16, 2024

కేంద్రం అప్పులు చేయడం లేదా ?: పురంధేశ్వరికి మంత్రి అవంతి కౌంటర్

ఏపీ ప్రభుత్వానికి అప్పులపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదంటూ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి చేసిన విమర్శలకు మంత్రి అవంతి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. పురంధేశ్వరి ఏపీ అప్పుల గురించి మాట్లాడుతున్నారని, కేంద్రం అప్పులు చేయడం లేదా ? అని ప్రశ్నించారు. విభజన హామీలు అమలుపై బీజేపీ నాయకులు మీరు చేసున్న కృషి ఎంటి ? అని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తున్నామన్న మంత్రి అవంతి.. ఇప్పటికే సీఎం రెండు సార్లు కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. పురంధేశ్వరి మీకు చిత్త శుద్ది వుంటే వైజాగ్ స్టీల్ గురించి మాట్లాడండి అని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, నిజంగా పవన్ కళ్యాణ్ కు ఏపీపై శ్రద్ధ ఉంటే కేంద్రంపై స్టీల్ ప్లాంట్ విషయంపై పోరాటం చేయాలని మంత్రి అవంతి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement