Friday, April 26, 2024

దుర్గమ్మ సేవలో మంత్రి ఆళ్ల నాని

ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) కుటుంబసభ్యులతో శ్రావణ శుక్రవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి డి.భ్రమరాంబ, పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో ఉపముఖ్యమంత్రి కి  స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ ఆళ్ల నాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం పాలక మండలి చైర్మన్ సోమినాయుడు ఉపముఖ్యమంత్రి ఆళ్ల నానికి అమ్మవారి చిత్ర పటాన్ని అందజేయాగా.. ఆలయ కార్యనిర్వాహణ అధికారి భ్రమరాంబ అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement