Friday, May 3, 2024

AP : అన్నదమ్ములపై అర్ధరాత్రి దాడి…యువకుడి మృతి

కర్నూలు: కర్నూలు నగరంలోని ఎస్ నాగప్ప వీధి పరిధిలో అర్ధరాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రోజా వీధికి చెందిన అన్నదమ్ములు ఉప్పరి సాయి (17), ఉప్పరి గురుమూర్తిలు వాహనంలో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వారిని వెంటాడి కత్తులతో దాడి చేశారు.

- Advertisement -

ఈ దాడిలో గాయపడిన ఇరువురిని ఒకటో పట్టణ పోలీసులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఉప్పరి సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలం చేరుకున్న వన్ టౌన్ సిఐ పవన్ కుమార్ నేతృత్వంలో పోలీస్ బృందం నిందితుల కోసం రాత్రంతా గాలించారు. అనంతరం హత్య వివరాల సేకరణ నిమిత్తం పోలీస్ డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్లను సంఘటన స్థలంలో పరిశీలించి వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వ్యక్తులు వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తిస్థాయి వివరాల శాఖలో పోలీస్ టీం నిమగ్నమై ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement