Monday, May 6, 2024

Eluru: నగరంలో భారీ చోరీ

ఏలూరు, ప్రభ న్యూస్, క్రైమ్ : ఏలూరు నగరంలోని శ్రీరామ్ నగర్ 9వ రోడ్డులో నివాసముంటున్న నీలి దుర్గా వెంకట నాగేంద్ర రావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. వ్యక్తిగత అవసరాల నిమిత్తం 23వ తేదీ రాజమండ్రి వెళ్లి 24వ తేదీ ఇంటికి చేరుకునేసరికి తలుపులు పగలగొట్టి ఉండడాన్ని నాగేందర్రావు గమనించారు. దీంతో అనుమానం వచ్చిన నాగేంద్రరావు ఇంట్లోకి వెళ్లి బీరువా తెరిచి చూడగా.. అందులో ఉన్న 175 కాసులు బంగారం, 750 గ్రాములు బంగారు అభరణాలు, 750 రూపాయలు చోరీకి గురైనట్లు గుర్తించారు.

వెంటనే నాగేంద్రరావు ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి సిసిఎస్ సిఐ సిహెచ్ మురళీకృష్ణ, త్రీ టౌన్ సీఐ వరప్రసాద్, వన్ టౌన్ సిఐ ఆది ప్రసాద్, త్రీ టౌన్ ఎస్ఐ శంకర్ తన సిబ్బందితో చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ బృందం సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement